ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్‌కర్నూల్ లో ర్యాగింగ్ కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 01:40 PM

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన మరోసారి కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులను వేధించిన నలుగురు సీనియర్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. వారిని ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 6వ తేదీన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నలుగురు సీనియర్ విద్యార్థులు క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థినులను తీవ్రంగా వేధించారు. తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వారిని గోడకుర్చీ వేయించి, తమకు సెల్యూట్ చేయాలంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థినులు ప్రిన్సిపాల్ రమాదేవికి ఫిర్యాదు చేశారు.తక్షణమే స్పందించిన ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులను ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa