గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ విడుదల చేయనుంది. గవర్నర్ ఇప్పటికే ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్ విడుదలైన మూడు రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన పత్రాల తయారీలో నిమగ్నమయ్యారు. మరోవైపు, వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa