కోకాపేట నియోపోలీస్ భూముల వేలం హెచ్ఎండీఏకి భారీ ఆదాయాన్ని తెచ్చింది. మూడో విడత వేలం ఈరోజు పూర్తి కాగా, ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ 20లో ఎకరానికి 118 కోట్లు ధర పలికింది.ఈ విడత ద్వారా 8.04 ఎకరాల భూములért HMDAకి వెయ్యి కోట్లు ఆదాయం లభించింది. ఇప్పటివరకు మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు మొత్తం 3,708 కోట్ల రూపాయలు HMDAకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేయనున్నారు. కోకాపేటలో 29 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాల భూమికి వేలం జరుగనుంది. కోకాపేట గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాలకు డిసెంబర్ 5న చివరి విడత వేలం ఉంటుంది.రెండో విడత ఆన్లైన్ వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.151.25 కోట్ల ధర పలికింది. 15వ ప్లాట్లో 4.03 ఎకరాలకు, 16వ ప్లాట్లో 5.03 ఎకరాలకు బిడ్డింగ్ జరిగింది. 15వ ప్లాట్లో ధర ఎక్కువగా ఉండగా, 16వ ప్లాట్లో ఎకరానికి గరిష్టం రూ.147.75 కోట్లు నమోదు అయ్యింది. సగటు ధర ఎకరాకు రూ.142.83 కోట్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.మొత్తం 9.06 ఎకరాల బిడ్డింగ్ ద్వారా రూ.1,352 కోట్లు HMDAకు లభించగా, ఈ నెల 24వ తేదీన విక్రయించిన భూములను కలిపి ప్రభుత్వానికి మొత్తం రూ.2,708 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. గతానికి పోలిస్తే, రెండేళ్ల క్రితం కోకాపేట నియోపోలిస్లో ఎకరానికి రూ.100.75 కోట్లు మాత్రమే వచ్చి ఉంటే, ఈసారి రెండు విడతల్లో ధరలు రూ.137 కోట్ల నుంచి రూ.151 కోట్ల వరకు చేరడం విశేషంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa