ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్ వెజ్ లవర్స్‌కు షాక్.. పెరిగిన చికెన్ ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 11:52 AM

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ కోసం షాపులకు పరుగులు తీస్తుంటారు. అయితే, ఈ వారం నాన్ వెజ్ ప్రియులకు కాస్త నిరాశే ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కేజీ రూ.260కి చేరగా, ఇతర జిల్లాల్లోనూ దాదాపు ఇదే ధర పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో కేజీ చికెన్ ధర రూ.240 నుండి రూ.260 వరకు ఉంది. కర్నూలు, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో రూ.220 నుండి రూ.230 వరకు ఉంది. మటన్ ధర కేజీ రూ.800 నుండి రూ.900 వరకు అమ్ముతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa