ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు భార్యల నామినేషన్.. సర్పంచ్ ఎవరంటే?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 03:15 PM

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వింత ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట(D) అక్బర్‌పేట- భూంపల్లి (M) జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే వీరిలో సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందోనని గ్రామస్తుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండటంతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. పంచాయతీ పరిధిలో ఉన్న 10 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa