ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో రోజురోజుకి భారతీయ వంటకాలకు పెరుగుతున్న ఆదరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:28 PM

అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ వంటి వాటికే పరిమితమైన అమెరికన్లు, ఇప్పుడు ఘాటైన బిర్యానీలు, మసాలా కూరలను కూడా ఇష్టంగా తింటున్నారు. వారి ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది.కాలిఫోర్నియాలోని ఓ తెలుగు టెకీ తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లగా, వారంతా దక్షిణాది వంటకాలను ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా మసాలాలు తక్కువగా ఉండే థాయ్, జపనీస్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు, ఇప్పుడు స్పైసీ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కాదని ఇండియన్ రెస్టారెంట్లకు వస్తున్నారు.ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2025 అక్టోబర్ నాటి గణాంకాల ప్రకారం, యూఎస్‌లో సుమారు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉండగా, వాటిలో అత్యధికంగా 2,000 రెస్టారెంట్లు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్సాస్ (1,500), న్యూయార్క్ (1,000) రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో, డాలస్ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. డాలస్ మెట్రో ప్రాంతం అయితే సుమారు 400 రెస్టారెంట్లతో దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa