ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా రెండుసార్లు సర్పంచులుగా ఎన్నికైన భార్యాభర్తలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 02:11 PM

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామంలో వరుసగా రెండుసార్లు భార్యాభర్తలు సర్పంచులయ్యారు. గత పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఓసీ మహిళకు కేటాయించడంతో పులి సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి స్థానం జనరల్ కు రిజర్వ్ చేశారు. సునిత భర్త అంజిరెడ్డి బరిలో నిలిచి 254 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో భార్యాభర్తలిద్దరూ సర్పంచుల జాబితాలో నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa