ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రానున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తుది తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 04:07 PM

తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు వెల్లడించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులకు స్పీకర్ కార్యాలయం నుండి నోటీసులు అందాయి.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఆయన తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తుందా? లేక వ్యతిరేకంగా వస్తుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa