ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణుగూరు ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 12:41 PM

కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. మణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తుందని, ఇది జరిగితే మణుగూరు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  మరో మూడేళ్లలో మణుగూరులో సింగరేణి ఉండదని, ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ, లేదంటే కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa