ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు.. 10 మంది భద్రతాసిబ్బందికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:18 PM

ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, IED బాంబులు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పలు ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పుర్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa