ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఐఎంతో కుదిరిన డీల్... మేయర్ స్థానం పై కాంగ్రెస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 02:34 PM

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 15న జరిగే మేయర్ ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఫలితాలు పూర్తిగా రాకముందే, పార్టీలు మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 30కి పైగా స్థానాలు వస్తాయని భావించిన బీజేపీ 28 స్థానాలకే పరిమితమైంది. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలను రంగంలోకి దించాలని కమలనాథులు వ్యూహరచన చేశారు. మొదట అంచనాల మేరకు ఫలితాలు రావడంతో సంబరపడిన బీజేపీ, చివరిలో కొన్ని స్థానాలు చేజారిపోవడంతో నిరాశ చెందింది. అయినప్పటికీ, బీజేపీ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించినా, అతను అందుబాటులోకి రాకపోవడంతో ఆశలు వదులుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో మేయర్ స్థానం దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 28 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 32 మంది అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa