మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ లో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు రాము పంతులు & ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ & ఆలయ చైర్మన్ ధనరాజ్ యాదవ్ గారు మహాశివరాత్రి పురస్కరించుకుని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం 'ఏ ఏ టీమ్ అవేర్నెస్ అసోసియేషన్' & శ్రీ రామ కృష్ణ నాట్య మండలి వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలు & నాటక ప్రదర్శనలు వీక్షించి వారిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ "ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. శివుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను."ఈ కార్యక్రమంలో ఏ ఏ టీమ్ యాక్టర్ శ్రీమతి సాయి లక్ష్మి చంగతి, సంగీత దర్శకులు నామ చంద్ర బాబు నాయుడు మరియు ఆలయ సభ్యులు,పిచ్చి రెడ్డి, యువకులు రామ్ చరణ్, సాయి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa