కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో విజయవంతంగా ముగిశాయి. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమై, చివరి రోజు క్షేత్ర దిగ్బలి వేద ఆశీర్వచనంతో ఉత్సవాలు సమాప్తమయ్యాయి. ఈ వైదిక కార్యక్రమాలను వేద పండితుడు గణపతి శర్మ, వేదపాఠశాల విద్యార్థులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల విజయవంతమైన ముగింపునకు సహకరించిన అధికారులకు, ట్రస్టు సభ్యులకు, మాజీ ఛైర్మన్ సత్యనారాయణ శర్మ, అర్చకులు బలరామ శర్మ ఆశీర్వచనం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa