తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 26 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 28న ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుండగా.. ఆ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa