ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాజీ జయంతి: యువతకు ఆదర్శంగా నిలిచిన వీరత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 03:50 PM

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్ దేవ్ పల్లి శివాజీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అత్యంత పరాక్రమవంతుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ధైర్యం-వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ జీవితం యువతకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. శత్రువును బలహీనంగా భావించవద్దని, అలాగని అతనికి భయపడి మన బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని శివాజీ మహారాజ్ తన సైన్యానికి ఉపదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa