ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి మొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 12:12 PM

హైదరాబాద్‌లోని KPHB బస్టాప్ సమీపంలో పద్మావతి ప్లాజాలోని సాయి మొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విలువైన ఫోన్లు, సామాగ్రి దగ్ధమయ్యాయి. ఇటీవల నగరంలో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సుమారు అరగంట పాటు శ్రమించిన తర్వాత మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రాథమికంగా షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కొంత ఆందోళన కలిగింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించే అవకాశం ఉండటంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం సంభవించి ఉంటుందని అంచనా.శుక్రవారం అమీర్‌పేట మైత్రీవనంలోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa