TG: కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో భూదాన్ భూములను పరిశీలించి మాట్లాడారు. రేవంత్ సర్కార్కు భూములు పంచడం చేతకాదని, లాక్కోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని శాపనార్థాలు పెడుతున్నారని, కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములను తీయగలరా అని ప్రశ్నించారు. పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ అని, తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa