Kaleshwaram Lift Irrigation Project పై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన వాదనల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణల నేపథ్యంలోనే కమిషన్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎవరినైనా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని Justice Pinaki Chandra Ghose నేతృత్వంలోని కమిషన్ను ఏర్పాటు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.కాళేశ్వరం ప్రాజెక్ట్పై Justice P. C. Ghose Commission ఏర్పాటు మరియు కమిషన్ సమర్పించిన నివేదికపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్తో పాటు పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణంలో అధికార దుర్వినియోగం జరిగిందని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ కమిషన్ పలువురిపై తప్పుడు ఆరోపణలు నమోదు చేసిందని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కోర్టుకు వివరించారు.అలాగే మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Raoను సాక్షిగా పిలిచి దోషిగా పేర్కొనడం సరైన విధానం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కమిషన్ నోటీసులు కూడా తప్పుడు విధానంలో జారీ చేశారని ఆరోపించారు.ప్రాజెక్ట్ స్థల మార్పు, ఖర్చు అంచనాలు, నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంలో ఎవరూ వ్యక్తిగతంగా లాభపడలేదని ఆయన పేర్కొన్నారు. కమిషన్ నివేదిక చెల్లదని, దానిపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa