రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని బోనాల పెద్దూర్ ఎద్దుగుట్టపై ఉన్న శ్రీ మల్లన్న స్వామి ఆలయంలో బుధవారం పట్నాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొండూరు రవీందర్ రావు, కల్లూరి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో పండుగ వాతావరణంతో నిండిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa