తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న Cancer కేసులను నియంత్రించేందుకు, ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’గా ప్రకటిస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో నం.17 జారీ చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో ఎక్కడైనా క్యాన్సర్ కేసు నమోదైతే, ఆ వివరాలను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయడం ఇకపై తప్పనిసరి.ఇంతకు ముందు కేవలం Nizam's Institute of Medical Sciences (నిమ్స్), Mehdi Nawaz Jung Institute of Oncology (ఎంఎన్జే) వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు ఉండేవి. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అనేక మంది రోగుల సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉండేది కాదు.ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, అలాగే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా తమ వద్ద నమోదయ్యే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెలలోపు ఆరోగ్య శాఖకు అందజేయాలి.ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్కు సంబంధించిన ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతమవుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రి ఈ డేటా సేకరణకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఎక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలు విస్తరించాలి అనే అంశాలపై ప్రభుత్వం శాస్త్రీయంగా ప్రణాళికలు రూపొందించనుంది.రోగుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ, ఈ గణాంకాలను ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం ద్వారా ‘క్యాన్సర్ ఫ్రీ తెలంగాణ’ లక్ష్యానికి చేరుకోవడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa