గచ్చిబౌలిలోని పీజేఆర్ ఫ్లైఓవర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి వికాస్ కుమార్ మృతి చెందగా, అతని స్నేహితుడు భరత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పుప్పాలగూడకు చెందిన వికాస్, భరత్ తెల్లవారుజామున 4 గంటలకు టిఫిన్ కోసం నానక్రామ్గూడ వెళ్లి తిరిగి వస్తుండగా, అతివేగం, అజాగ్రత్త కారణంగా బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలైన వికాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa