ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 12:04 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధ, గురువారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, రోజువారీ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోనూ నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa