దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, గురువారం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల పరిధిలోని ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న మెయిన్ డెలివరీ సిస్టర్న్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏకేబీఆర్ లిఫ్ట్ స్కీము ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని 2082 ఎకరాలకు నీరందించేందుకు రూ. 90.96 కోట్లతో పనులు మంజూరయ్యాయని, మొత్తం 6691 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa