ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హజ్ యాత్రకు ఇకపై పిల్లలను తీసుకెళ్లడం నిషేధం

international |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 11:05 PM

హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి సౌదీ అరేబియా సర్కారు నిర్ణయం షాక్ ఇస్తోంది. ముస్లింగా పుట్టిన ప్రతీ వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనుకుంటారు. ముఖ్యంగా రంజాన్ సమయంలో అక్కడకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా అనేక మంది మక్కాను దర్శించుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారందిరకీ అలర్ట్ ఇచ్చింది సౌదీ అరేబియా సర్కారు ప్రభుత్వం. ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లే వాళ్లు పిల్లలను తీసుకుని రాకూడద్దంటూ వారిపై నిషేధం విధించింది. అలాగే వీసా నిబంధనల్లోనూ అనేక మార్పులు చేపట్టింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2025 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడికి పిల్లలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక యాత్రలో జరిగే విపరీతమైన రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పిల్లలను రక్షించాలనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణం అని సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం హజ్ యాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే పిల్లలపై తీసుకు రావొద్దని చెబుతున్నట్లు పేర్కొంది.


అంతేకాకుండా తొలి సారి మక్కాకు వచ్చే వారికి సడలింపు కూడా ఇచ్చింది. మొదటి సారి హజ్ యాత్రకు వచ్చే ప్రయాణికులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. అయితే ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర యాత్ర చేయడానికి అవకాశం కల్పించడానికే సౌదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అలాగే సౌదీ పౌరులు, నివాసితులు సైతం 2025 హస్ సీజన్ కోసం నుసుక్ యాప్ లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.


కొత్త నింబధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని వారి ప్రయాణ సహచరుల పేర్లను కూడా తెలపాల్సి ఉంటుందని చెప్పింది. అలగే దేశీయ యాత్రికుల కోసం మంత్రిత్వ శాఖ కొత్త వాయిదాల ఆధారిత చెల్లింపు ప్రక్రియను తీసుకు వచ్చింది. హబ్ ప్యాకేజీ డబ్బులను మూడు వాయిదాల్లో చెల్లించే విధంగా చర్యలు చేపట్టింది. రిజర్వేషన్ చేసిన 72 గంటల లోపు 20 శాతం డిపాజిట్, ఆ తర్వాత రంజాన్ నాటికి 40 శాతం, శావాల్ నాటికి 40 శాతం చొప్పున చెల్లించాలని వివరించింది. చివరి చెల్లింపు అందే వరకు రిజర్వేషన్లు నిర్ధారించబడవని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ఇవి మాత్రమే కాకుండా భారత దేశం సహా 14 దేశాల నుంచి వచ్చే వ్యక్తులు కేవలం సింగిల్ ఎంట్రీ వీసాలకు మాత్రమే అర్హులు అవుతారు. కొంతమంది ప్రయాణికులు అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ఉపయోగించే బహుళ-ఎంట్రీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. అనధికారిక తీర్థ యాత్రలు ముఖ్యమైన పవిత్ర ప్రదేశాల్లో రద్దీని పెంచుతాయని.. దాన్ని అడ్డుకుంటే.. యాత్రికుల భద్రతకు హామీ కల్పించవచ్చని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com