ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిన పాకిస్తాన్ సంతతి ఆటగాడు

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:38 PM

మ్యాచ్ ఆడుతూ ఓ క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాదకర సంఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ క్రికెట్ గ్రౌండ్‌లో చోటుచేసుకుంది. నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో మ్యాచ్ జరుగుతుండానే క్రికెటర్ గ్రౌండ్‌లో కుప్పకూలిపోయాడు. వైద్యులు పరీక్షలు చేసే సమయానికే క్రికెటర్ మరణించాడు.


పాకిస్తాన్ సంతతికి చెందిన జునైద్ జాఫర్ ఖాన్ 2013లో అడిలైడ్‌‌కి వచ్చాడు. టెక్ పరిశ్రమలో చేస్తున్న జునైద్ ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యాడు. క్రికెట్ మీద ఆసక్తితో ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. మార్చి 15న అడిలైడ్‌లోని కాన్కార్డియా కాలేజ్ ఓవల్‌లో ప్రిన్స్ ఆల్‌ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో మ్యాచ్ జరిగింది. ఆరోజు ఉష్ణోగ్రత 41.7 డిగ్రీలు నమోదయింది. దాంతో ఒక్కసారిగా తీవ్ర వేడి కారణంగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది.


క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే మ్యాచ్‌ను నిలిపివేయాలి. అయితే ఆ రోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో మ్యాచ్‌ని కొనసాగించారు. రంజాన్ మాసం కావడం, ఉపవాసం ఉండటంతో బహుశా జునైద్ నీరసానికి గురై ఎండ తీవ్రతకి తట్టుకోలేకపోయుంటాడు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నలభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. సిడ్నీ, విక్టోరియాల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నలభై సంవత్సరాల జునైద్ మరణంపై ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com