రోహిత్ శర్మ వెకేషన్ మోడ్ని ఎంజాయ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025గా టీమిండియాను విజేతగా నిలిపిన అనంతరం రోహిత్ శర్మ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దుబాయ్ నుంచి ఇండియా వచ్చిన రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల వెకేషన్కి వెళ్లి చిల్ అయ్యాడు.
మాల్దీవుల వెకేషన్కి వెళ్లిన రోహిత్ శర్మ తన పాప, భార్యతో కలిసి టైమ్ స్పెండ్ చేశాడు. పాప సమైరాతో కలిసి చిన్నపిల్లాడిలా మారి ఫొటోలకు పోజులిచ్చాడు. ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మాల్దీవుల బీచ్లో భార్య రితికాతో కలిసి ఫొటోలు దిగాడు.
మాల్దీవుల్లో సైకిల్పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది. రోహిత్ శర్మ తనకు ఎలా కావాలంటే అలానే ఉంటాడు. గ్రౌండ్లో అయినా, బయట అయినా చాలా ఫన్నీగా ఉంటుంటాడు. మాల్దీవుల వెకేషన్లో కూడా చిన్నపిల్లాడిలా సైకిల్పై నిల్చొని ఎంజాయ్ చేశాడు. ఆ ఫొటోలు, వీడియోలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మాల్దీవుల వెకేషన్ నుంచి ఇటీవలే భారత్ చేరుకున్న రోహిత్, ఎయిర్పోర్ట్లో ఫొటోగ్రాఫర్లపై కాస్తంత అసహనం వ్యక్తం చేశాడు. పిల్లల్ని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడంతో వాళ్లని వారించి ఫ్యామిలీని కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అందర్నీ పిలిచి సరదాగా ఫొటోలకు పోజులిచ్చాడు. రోహిత్ శర్మ కొడుకు ఆహాన్ శర్మను ఎత్తుకొని ఎయిర్పోర్ట్లో కనిపించిన ఫొటోలు కూడా ఎక్స్లో వైరల్ అయ్యాయి.
ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024లో రోహిత్ను పక్కకు తప్పించి హార్దిక్ పాండ్యాకి ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్సీ పగ్గాలు అందించింది. అప్పటి నుంచి రోహిత్ శర్మ ప్లేయర్గానే కొనసాగుతున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రేక్ తీసుకుని ఫ్యామిలీకి టైమ్ ఇచ్చాడు. త్వరలోనే రోహిత్ ముంబై ఇండియన్స్ క్యాంప్లో అడుగుపెట్టనున్నాడు.
![]() |
![]() |