ఐపీఎల్లో తళుక్కున మెరిసిన స్టార్లలో శశాంక్ సింగ్ ఒకడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి మెరుపు ఇన్నింగ్స్లో మ్యాచ్లు గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2024లో ఆడిన శశాంక్ సింగ్ తన పేరును అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు. ఐపీఎల్ 2025కి ముందు నిర్వహించిన మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ప్లేయర్లలో శశాంక్ ఒకడంటే అతని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ మెగా వేలం సమయంలో పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వికెట్ కీపర్ ప్రభుసిమ్రాన్ సింగ్తో పాటు ఆల్రౌండర్ శశాంక్ సింగ్ను రిటైన్ చేసుకున్నారు. మెగా వేలంలో తనను రిటైన్ చేసుకోవడంపై చాలా ఆనందం వ్యక్తం చేసిన శశాంక్.. ఆ సమయంలో జరిగినది రీ కాల్ చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ శశాంక్ను రూ.5.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.
"ఇదో పెద్ద డీల్. దీపావళికి మూడ్రోజుల ముందు అనుకుంటా నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నిన్ను రిటైన్ చేసుకుంటున్నాం, ఒక ఫామ్ పంపుతున్నాం సైన్ చేసి రేపటికల్లా పంపు అన్నారు. నేను వాళ్లు పంపిన ఫామ్ని నింపేసి తిరిగి పంపాను. ఎలాంటి బేరాలు లేవు. ఎంత ఇస్తున్నారో కూడా అందులో పేర్కొనలేదు. ఒకప్పుడు నన్ను ఏ టీమ్ తీసుకుంటుందో అనే టెన్షన్ ఉండేది. నా ఫ్యామిలీ కూడా టెన్షన్ పడేది. ఒక్కోసారి వేలంలో అన్సోల్డ్ అయ్యేవాడిని. ఒకవేళ తీసుకున్నా ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందో లేదో తెలియదు" అని శశాంక్ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు.
శశాంక్ సింగ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించగలడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ అంత బౌలర్ని కాదని.. కానీ తన బలాలు ఏంటో తనకు తెలుసంటూ శశాంక్ చెప్పాడు. కచ్చితంగా మ్యాచ్ విన్నర్ని అవుతానని కాన్ఫిడెంట్గా చెప్పాడు. తాను వేసే ఓవర్లు జట్టుకు కీలకంగా మారుతాయని అనుకుంటానని చెప్పాడు. ఈ సీజన్లో బౌలింగ్తోనూ రాణించేందుకు శశాంక్ సింగ్ ప్రయత్నం చేస్తున్నాడు.
కెరీర్లో ఇప్పటి వరకు 24 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన శశాంక్ సింగ్ 19 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. రెండు హాఫ్ సెంచరీలతో 161.46 స్ట్రయిక్ రేట్తో 423 పరుగులు చేశాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఐపీఎల్ 2024లోనే శశాంక్ సింగ్ 354 పరుగులు చేయడం విశేషం.
![]() |
![]() |