ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 08:44 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. మార్కాపురం పట్టణ శివారులో సుమారు 15 రోజుల క్రితం రెండు పాములు గుడ్లు పెట్టాయి. ఈ విషయాన్ని స్థానికులు స్నేక్ క్యాచర్ నిరంజన్‌కు తెలియజేశారు.వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నిరంజన్ 120 పాము గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచారు. రెండు పాములకు చెందిన ఆ గుడ్లను వేర్వేరు డబ్బాల్లో ఇసుకలో ఉంచి పొదిగించినట్లు ఆయన తెలిపారు. వాటిలో నుంచి 80 పాము పిల్లలు బయటకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com