ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు పదో తరగతి విద్యార్థి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 11:17 AM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వట్టి చెరుకూరులో చెరువులో దిగి పదో తరగతి విద్యార్థి కిషోర్ మృతి చెందాడు. బీసీ వసతి గృహంలో నీరు లేకపోవడంతో నీటి కోసం గురువారం ఉదయం చెరువుకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఓ విద్యార్థి చెరువులోకి జారి పోయాడు. ఆ విద్యార్దిని కాపాడేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించారు. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఆ ఇద్దరు విద్యార్థులు కూడా చెరువులోకి జారీపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరు విద్యార్థులను కాపాడారు. కాగా కిషోర్ అనే విద్యార్థి చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. కిషోర్‌ది వెల్దుర్తి మండలం, గంగలకుంట గ్రామం. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్జి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com