ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ను వదిలి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఓ పక్క ఐపీఎల్ మ్యాచులు జరుగుతుండగానే అతడు.. తన సొంత దేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలతో రబాడ జట్టుకు దూరమైనట్లు గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అతడు ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయాన్ని మాత్రం గుజరాత్ మేనేజ్మెంట్ వెల్లడించలేదు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన మెగా వేలంలో రబాడను దక్కించుకుంది గుజరాత్. వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో రబాడకు మంచి రికార్డు ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో 82 మ్యాచులు ఆడిన ఈ ప్రొటీస్ ప్లేయర్.. 22.29 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు ఆడటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో గుజరాత్ తరఫున రెండు మ్యాచులు ఆడిన అతడు.. స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. పంజాబ్ కింగ్స్పై 1/41, ముంబై ఇండియన్స్పై 1/42 బౌలింగ్ గణాంకాల్ని నమోదు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో ఆడలేదు. అతడి స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన గుజరాత్.. రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ తన తదుపరి మ్యాచుల్లో ఏప్రిల్ 6న సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, జోస్ బట్లర్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, మానవ్ సుథార్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫానే రూథర్ఫర్డ్, సాయి కిశోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా
![]() |
![]() |