ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 04:56 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా మహమ్మద్ యూనస్‌పై మండిపడ్డారు.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు ప్రజలంటే ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఆరోపించారు.బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయని అన్నారు. మీడియాకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో ఈ నేరాలు బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు సహా తన కుటుంబం మొత్తం హత్యలకు గురైందని ఆమె ఆక్రోశించారు.దేవుడు తనను ఏదో ఒక కారణం చేత ఇంకా బతికించాడని, త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవామీ లీగ్ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆమె హెచ్చరించారు. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఉండాలని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com