శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ తో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరనుంది. జనవరిలో ఐర్లాండ్తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రై సిరీస్కు బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్గా నియమించింది. ఇక ఈ ముక్కోణపు వన్డే సిరీస్ ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. మే 11న ఫైనల్ జరుగుతుంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్లో ఆడుతుంది.గాయాల కారణంగా పేస్ ద్వయం రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధును ఎంపిక చేయలేదు. కశ్వి గౌతమ్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్కి జట్టులో చోటు దక్కింది
![]() |
![]() |