శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ తో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరనుంది. జనవరిలో ఐర్లాండ్తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రై సిరీస్కు బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్గా నియమించింది. కాగా, గాయాల కారణంగా పేస్ ద్వయం రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధును ఎంపిక చేయలేదు. కశ్వి గౌతమ్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్కి జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అలాగే ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చారు.ఇక ఈ ముక్కోణపు వన్డే సిరీస్ ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. మే 11న ఫైనల్ జరుగుతుంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్లో ఆడుతుంది. భారత జట్టు ఏప్రిల్ 27న శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్లు ఆడనున్నాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అన్ని మ్యాచులు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగన్నాయి.
ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ :
మొదటి వన్డే: శ్రీలంక vs భారత్, ఏప్రిల్ 27
రెండో వన్డే: భారతదేశం vs దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 29
మూడో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 02
నాలుగో వన్డే: శ్రీలంక vs భారత్, మే 04
ఐదో వన్డే: దక్షిణాఫ్రికా vs భారత్, మే 07
ఆరో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 09
ఫైనల్: మే 11
![]() |
![]() |