చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాల మయమని వైసీపీ నేత, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... అధికారం కోసం దిగజారిపోవడం, ప్రలోభాలకు గురిచేయడం ఆయన నైజం. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేనాటికి గెలుస్తామన్న ధీమా వారిలోనే లేదు. అందుకే నెలరోజులు సమయం తీసుకుని వారి కుట్రలకు పదును పెట్టారు. అధికారాన్ని విచ్చలవిడిగా ప్రయోగించి విజయం సాధించారే కానీ, ప్రజలు మాత్రం కూటమి పార్టీలను చీదరించుకుంటున్నారు. వైయస్ఆర్సీపీ కి అండగా నిలిచి ఓటేసిన కార్పొరేటర్లను అభినందిస్తున్నా. వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు కుట్రలు, కుతంత్రాలు, డబ్బు గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచిందని కూటమి నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటు. సందర్భం వచ్చినప్పుడు వారికి రాబోయే రోజుల్లో ప్రజలే చక్కన గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు.
![]() |
![]() |