తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 75 వసంతాల చంద్రబాబుపై జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళంగా అందించారు. భాష్యం రామకృష్ణ నేడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమల అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
![]() |
![]() |