బాపట్ల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిని కట్టడి చేయడానికి జిల్లాలోని 32 పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న 75 హోటళ్లు, లాడ్జిలు, దాబాల్లో శనివారం విస్తృతంగా సోదాలు చేశామని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆకస్మికంగా జరిపిన ఈ సోదాలలో లాడ్జిలు, హోటళ్ల రికార్డులను పోలీసులు పరిశీలించారు. బస చేసేవారి గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఆ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు.నేరాలకు పాల్పడే వారు, బెట్టింగ్ లు నిర్వహించే వారు, గంజాయి సేవించే వారు, ఇతర పలు అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు సహజంగా తాత్కాలిక ఆవాసం కోసం వీటిని ఎంచుకుంటారన్నారు. అటువంటి వాటికి చోటివ్వ వద్దనే ప్రధాన ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. రెస్టారెంట్లు దాబాలలో ఇతర ప్రదేశాలలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వారు విధిగా పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వివరించారు.
![]() |
![]() |