ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారిని మంగళవారం ఎన్. టి. ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ జి. లక్ష్మీశ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారిని ఆలయమర్యాదలతో స్వాగతించి, అమ్మవారి దర్శనంకు తొడ్కోని వెళ్లగా, దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించి, ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |