చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తప్పుడు కేసును బనాయిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో పేజీ రాస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆక్షేపించారు. తమ పార్టీ నాయకుల ప్రతిష్టను దిగజార్చేందుకు గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగినట్టు తప్పుడు కేసులు నమోదు చేసి, అందరినీ ఇరికించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. వారు అనుకున్న కథను ప్రజల్లకి పంపడానికి చిన్న చిన్న ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు ఇచ్చినట్టు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. వైయస్ఆర్సీపీలో కీలకంగా పని చేస్తున్న నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పథక రచన చేస్తుంటే దానికి పోలీసులు వంత పాడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో నమోదైన కేసులు కప్పి పుచ్చుకునేందుకే, అలా తమపై బురద చల్లుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్లో టీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు.
![]() |
![]() |