కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని కొమ్మూరి కనకారావు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. వైయస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగింది. కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పవన్కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారు. దళితులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మన ఆత్మగౌరవం మళ్ళీ నిలబడాలంటే మనమంతా జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడిగా మన జగనన్న మన దళిత బిడ్డలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేశారు. మన దళితులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. దేశమంతా జగనన్న పాలనను భేష్ అన్నారు. మనం జగనన్న నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావించాలి. అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మన జగనన్నది. డిప్యూటీ సీఎంతో పాటు మన దళితులు ఐదుగురికి క్యాబినెట్లో చోటు కల్పించిన ఘనత జగనన్నది. మన ఎస్సీ బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. మన జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.
![]() |
![]() |