జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు శుక్రవారం ఎమ్మిగనూరులో మస్జీద్ -ఏ -హాఫిజ్ కమిటీ మౌన నివాళి తెలిపింది. ఉగ్రవాదులకు వెంటనే శిక్షించాలని, ముస్లిం, హిందువులు కలిసి శాంతంగా ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు యూసుఫ్ మౌలానా, ఇమ్రాన్ మౌలానా, సయ్యద్ చాంద్, ఫారుక్, అల్తాఫ్, మెకానిక్ బాషా ఇతరులు పాల్గొన్నారు.
![]() |
![]() |