రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా కర్నూలు జిల్లాలో విద్యార్థుల కొరకు వర్చువల్ తరగతులు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూలులో మాట్లాడుతూ వర్చువల్ తరగతుల నిర్వహణతో జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ పదవ తరగతిలో హిందీ సబ్జెక్టులో 99 శాతం పాస్ అయ్యారని తెలిపారు. సోమవారం నుంచి రెమిడియల్ తరగతులు నిపుణులచే ఆన్లైన్ లో బోధన నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
![]() |
![]() |