తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. తలసేమియాపై అవగాహన కలిగించేందుకే ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేసి, వారికి భరోసా కల్పిద్దామని భువనేశ్వరి అన్నారు.‘‘ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా మందికి తలసేమియా వ్యాధి గురించి అవగాహన ఉండదు. ఈ వ్యాధి బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్ ప్రారంభించాం. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెలా రక్త మార్పిడి చేయాలి. మనం చేసే గొప్ప సేవ రక్తదానమే.. అందరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి
![]() |
![]() |