గుజరాత్లోని అంబాజీ టౌన్లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. భర్త చనిపోయిన కోడలికి మామే దగ్గరుండి పెళ్లి చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి చేసిన ఏడాదికే తన కొడుకు చనిపోయాడు. దీంతో కోడలు ఇంట్లో నెలల వయసు గల పాపతో బాధపడుతుంటే అది చూడలేక మామ తన స్నేహితుడి కొడుకుతో వైభవంగా పెళ్లి జరిపించాడు. ఆమెకు కొత్త జీవితాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో మామ ప్రవీణ్ సింగ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
![]() |
![]() |