రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకం, ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది. 3 స్టార్, పైస్థాయి హోటళ్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదించింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా, ఏడాదికి బార్ల లైసెన్స్ ఫీజును రూ.5 లక్షలుగా నిర్ధారించింది. సెప్టెంబరు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
![]() |
![]() |