మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్వాసితులు శనివారం ఆమెను కలిశారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదని, రీసర్వే నిర్వహించి R&R ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదు. రీసర్వే నిర్వహించాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఇతరుల పేర్లు ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారు’’ అని షర్మిల పేర్కొన్నారు.అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు బీజేపీకి సరెండర్ అయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. "పోలవరం ఎత్తు తగ్గితే ఉపయోగం లేదని ఒక్కరు కూడా నోరు విప్పలేదు. వైఎస్సార్ కొడుకు జగన్ అని ప్రజలు అధికారం ఇచ్చారు. జగన్ 6 నెలల్లో పోలవరం పూర్తిచేస్తారనుకుంటే.. పూర్తి చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధానం అమలు చేస్తూ బీజేపీతో రాజీ పడ్డారు." అని అన్నారు.
![]() |
![]() |