ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం అమరావతిలో ప్రధాని సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీనిపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.’ అని అన్నారు.రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 6500 - 7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు.
![]() |
![]() |