అమెరికాలో భార్య, కొడుకును తుపాకీతో కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న భారత టెక్కీ. వాషింగ్టన్ - న్యూకాజిల్ పట్టణంలో భార్య శ్వేతా పాణ్యం(44), కుమారుడు ధ్రువ (14)ను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న భారత టెకీ హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి(57). ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్న మరో కుమారుడు.. ఏప్రిల్ 24న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. హర్షవర్ధన్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకా. 2017లో భార్య శ్వేతతో కలిసి ఇండియాకు వచ్చి మైసూరు కేంద్రంగా హోలో వరల్డ్(HoloWorld) అనే రోబోటిక్స్ కంపెనీని స్థాపించిన హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి. కరోనా ప్రభావంతో 2022లో నిలిచిపోయిన హోలో వరల్డ్.. దీంతో తిరిగి అమెరికాకు వెళ్లిపోయిన దంపతులు. కరోనా కంటే ముందు మోడీని కలిసి దేశ సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ఉంచిన హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి
![]() |
![]() |