ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆల్రౌండర్ సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 47 బంతుల్లో 88 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో హాఫ్ సెంచరీ సాధించిన కరన్, CSK బ్యాటింగ్ను ఒంటిచేత్తో ముందుండి నడిపించాడు. ఈ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టిన అతను, జట్టు స్కోర్ను గౌరవప్రదమైన స్థితికి తీసుకొచ్చాడు.
మిగతా CSK బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ 32 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ, రవీంద్ర జడేజా (17), షేక్ రషీద్ (11), ఆయుష్ మాత్రే (7) పరుగులతో తమ ఇన్నింగ్స్ను ముగించారు. బ్యాటర్లలో ఎక్కువ మంది పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, సామ్ కరన్ ఒక్కడే చెలరేగి ఆడటం CSK ఇన్నింగ్స్కు ఊపిరిలూదినట్లైంది.
కరన్ ఈ మ్యాచ్లో చూపిన ఆటతీరు, అతని ఆల్రౌండ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ సీజన్లో CSK ఆశలను మరింత పెంచిన కరన్, రాబోయే మ్యాచ్లలోనూ ఇదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa