దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ 2950 పాయింట్ల లాభంతో 82,404 వద్ద ముగిసింది. నిఫ్టీ 912 పాయింట్లు లాభపడి 24,920 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
![]() |
![]() |