ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీకి నిరాశ.. మరోసారి రిమాండ్ పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 12:20 PM

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ రిమాండ్ ముగిసింది. మంగళవారం ఉదయం పోలీసులు ఆయనను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆయనకు బుధవారం వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు మళ్లీ జిల్లా జైలుకు తరలించారు.కాగా, ఇదే కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి రిమాండ్ నేటితో ముగియడంతో ఇవాళ మళ్లీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేసులో పరారీలో ఉన్న మరికొంత మంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ  కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ‌లోని సీఐడీ కోర్టు మే 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసివ విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com